ఓటమి విరామం మాత్రమే!

ఓటమి విరామం మాత్రమే!
x
Highlights

ఓటమి విరామం మాత్రమే నని జనసేన నాయకుడు నాగబాబు అన్నారు. ఎన్నికల్లో ఓటమి తరువాత తొలిసారిగా అయన తన యు ట్యూబ్ ఛానెల్ నా ఇష్టం ద్వారా స్పందించారు. తమ...

ఓటమి విరామం మాత్రమే నని జనసేన నాయకుడు నాగబాబు అన్నారు. ఎన్నికల్లో ఓటమి తరువాత తొలిసారిగా అయన తన యు ట్యూబ్ ఛానెల్ నా ఇష్టం ద్వారా స్పందించారు. తమ పార్టీ విజయం కోసం మహిళలు విపరీతంగా శ్రమించారని వారికి ధన్యవాదములు తెలిపారు. తమ ఓటమి పట్ల వారు బాధతో ఉన్నారన్నారు. ఇది విరామం మాత్రమే. మళ్లి మనం ప్రజల కష్టనష్టాల్లో పాలు పంచుకోవడానికి సిద్ధం అయిపోవాలి. వారి తరఫున మాట్లాడటానికి ఎపుడూ తయారుగా ఉండాలి. ఒక వారం రోజుల పాటు విరామం తీసుకోండి. మన నాయకుడు తదుపరి కార్యాచరణను ప్రకటిస్తారు అని చెప్పారు. ఇక జగన్మోహన్ రెడ్డి విజయం పట్ల ఆయనకు తమ శుభాకాంక్షలు తెలిపిన నాగబాబు నవరత్నాలను చిత్తశుద్దితో అమలు చేసి ప్రజల ఋణం తీర్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో జగన్ సుపరిపాలన అందించే క్రమంలో తమ సహకారం ఉంటుందని వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories