ఏపీకి కేంద్రం మొండిచేయి: విజయసాయిరెడ్డి

ఏపీకి కేంద్రం మొండిచేయి: విజయసాయిరెడ్డి
x
Highlights

కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఢిల్లీలో విజయసాయిరెడ్డి మీడియాతో...

కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఢిల్లీలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. బడ్జెట్‌లో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు మొండిచేయి చూపిందన్నారు. ప్రత్యేక హోదాతో పాటు అమరావతి, పోలవరం నిర్మాణాలకు నిధుల ప్రస్తావనే లేదన్నారు. బడ్జెట్‌తో ఏపీకి అదనంగా ఇచ్చిందేమీ లేదని పెదవి విరిచారు. విశాఖ, విజయవాడ మెట్రో నిధుల విషయంలోనూ అన్యాయం జరిగిందని.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన ఏ హామీనీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. కార్మికులకు పెన్షన్లు ఆహ్వానిస్తున్నామని, ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్‌ కార్డులు ఇవ్వడం మంచిదేనని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories