కరోనాపై సీఎం జగన్ సంధించిన బ్రహ్మాస్త్రం ఇది : విజయసాయిరెడ్డి

కరోనాపై సీఎం జగన్ సంధించిన బ్రహ్మాస్త్రం ఇది : విజయసాయిరెడ్డి
x
Highlights

ఏపీలో ప్రతి ఒక్కరికీ మాస్క్‌లు ఉచితంగా పంపిణీ చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఒక్కొక్కరికీ మూడు మాస్కులు చొప్పున రాష్ట్రంలో సుమారు ఐదు...

ఏపీలో ప్రతి ఒక్కరికీ మాస్క్‌లు ఉచితంగా పంపిణీ చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఒక్కొక్కరికీ మూడు మాస్కులు చొప్పున రాష్ట్రంలో సుమారు ఐదు కోట్ల మందికి, 16 కోట్ల మాస్కుల పంపిణీకి సీఎం ఆదేశించారు. మాస్క్‌ల వల్ల కొంత రక్షణ లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు సీఎం. వీలైనంత త్వరగా మాస్కులు పంపిణీచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

మరోవైపు రాష్ట్రంలో ప్రతి పౌరుడికి మూడు మాస్కులు అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి చూపిన మార్గానికి దేశమంతా హర్షం వ్యక్తం చేస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 16 కోట్ల మాస్కుల పంపిణీ ప్రపంచంలో ఎక్కడా జరగలేదని తెలిపారు. కరోనాపై బ్రహ్మాస్త్రం ఇది. అతితక్కువ ప్రాణ నష్టంతో ఏపీ సేఫెస్ట్ ప్లేస్ అవుతుందని విజయసాయిరెడ్డి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories