బాలికలతో చర్చి పాస్టర్ నగ్న మసాజ్.. హోం మంత్రి ఆదేశించినా అరెస్ట్ చేయని పోలీసులు?

బాలికలతో చర్చి పాస్టర్ నగ్న మసాజ్.. హోం మంత్రి ఆదేశించినా అరెస్ట్ చేయని పోలీసులు?
x
Highlights

మైనర్ బాలికలతో నగ్నంగా బాడీ మసాజ్ చేయించుకున్న చర్చి పాస్టర్ కేసు మలుపులు తిరుగుతోంది. హోం మంత్రి ఆదేశించినా పోలీసులు ఇప్పటి వరకూ ఆయన్ను అరెస్ట్...

మైనర్ బాలికలతో నగ్నంగా బాడీ మసాజ్ చేయించుకున్న చర్చి పాస్టర్ కేసు మలుపులు తిరుగుతోంది. హోం మంత్రి ఆదేశించినా పోలీసులు ఇప్పటి వరకూ ఆయన్ను అరెస్ట్ చేయలేకపోయారు. దీంతో బాధితురాలి తల్లి దండ్రులు సీఎం క్యాంపు ఆఫీస్ ముందు ధర్నాకు సిద్ధపడుతున్నారు. అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో చర్చిఫాదర్‌ ఉదంతం చర్చనీయాంశంగా మారింది. నగ్నంగా పడుకొని మైనర్ బాలికలతో మసాజ్ చేయించుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న చర్చి పాస్టర్‌ కేసు మలుపులు తిరుగుతోంది. ఆయన్ను అరెస్ట్ చేయాలని రాష్ట్ర హోం మంత్రి ఆదేశించినా అరెస్ట్ చేయలేని పరిస్థితి నెలకొంది. పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్లినప్పటికీ చర్చి సభ్యులు, మహిళలు అడ్డుకోవడంతో వారు వెనక్కి మళ్లాల్సి వచ్చింది.

తాడిపత్రికి చెందిన ఓ బాలిక చర్చి స్కూళ్లో ఎనిమిదో తరగతి చదువుతోంది. 2018 సెప్టెంబర్లో ఆమెతోపాటు మరి కొంత మంది బాలికలను తన ఇంటికి పిలిచిన చర్చి పాస్టర్ ఎమిలిరాజ్ నగ్నంగా పడుకొని బాడీ మసాజ్ చేయాలని బెదిరించారని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు పెద్దగా స్పందించకపోవడంతో కేసు ముందుకు వెళ్లలేదు. పోలీసులు రాజీకి ప్రయత్నించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. మహిళా కమిషన్‌ జోక్యం చేసుకోవడంతో 6 నెలల తర్వాత తాడిపత్రి పోలీసులు చర్చి పాస్టర్‌పై కేసు నమోదు చేశారు. కానీ ఆయన్ను ఇప్పటి వరకూ అరెస్ట్ చేయలేదు. దీంతో నాలుగు రోజుల క్రితం హోం మంత్రి సుచరితకు ఫోన్ చేసిన బాధితురాలి తల్లి తన గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన మంత్రి వెంటనే పాస్టర్‌ను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. దీంతో ఎమిలిరాజ్‌ను అరెస్ట్ చేయడానికి వెళ్లగా చర్చి కమిటీ సభ్యులు, మహిళలు అడ్డుపడ్డారు. చర్చి పాస్టర్ ఎమిలిరాజ్‌ జాడ కనిపించలేదు. పరారీలో ఉన్నారని తెలుస్తోంది.

పాస్టర్‌కి సంబంధించి తమకు పై అధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని డీఎస్పీ రామసుబ్బారెడ్డి తెలిపారు. తాడిపత్తి పట్టణ సీఐ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోందని రామసుబ్బారెడ్డి తెలిపారు. ఎమిలిరాజ్‌ను అరెస్ట్ చేయకపోవడంతో సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ధర్నా చేపడతానని బాధితురాలి తల్లి చెబుతోంది. పాస్టర్‌ను అరెస్ట్ చేస్తామని చెబుతున్న జిల్లా పోలీసులు ధర్నా ప్రయత్నాలను విరమించాలని ఆమెకు నచ్చజెపుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories