గోదావరి ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం- హోం మంత్రి సుచరిత

గోదావరి ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం- హోం మంత్రి సుచరిత
x
Highlights

గోదావరి జిల్లాల్లోని ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేసినట్టు ఏపీ హోం శాఖ మంత్రి సుచరిత తెలిపారు. 24 మండలాల్లో 280 గ్రామాలు ముంపునకు...

గోదావరి జిల్లాల్లోని ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేసినట్టు ఏపీ హోం శాఖ మంత్రి సుచరిత తెలిపారు. 24 మండలాల్లో 280 గ్రామాలు ముంపునకు గురయ్యాయని, 194 ఎస్డీఆర్ఎఫ్, 120 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో 17 వేల 632 మందిని 32 పునరావాస కేంద్రాలకు తరలించారని, పశ్చిమగోదావరి జిల్లాలో 47 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. వరద ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ఆహారం, తాగునీరు అందిస్తున్నామని వివరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories