నిరూపిస్తే రాజీనామా చేస్తా: మంత్రి అవంతి సవాల్‌

నిరూపిస్తే రాజీనామా చేస్తా: మంత్రి అవంతి సవాల్‌
x
Highlights

వై‌సీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ వైసీపీ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, వైఎస్సార్ విగ్రహాలకు పర్యాటక శాఖ మంత్రి...

వై‌సీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ వైసీపీ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, వైఎస్సార్ విగ్రహాలకు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ పూల మాలలు వేసి నివాళర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తన ఏడాది పాలనతోనే చరిత్ర సృష్టించారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం జగన్ పని చేస్తున్నారని, విశాఖ భూ కబ్జాపై టీడీపీ నేతల ఆరోపణలను అవంతి శ్రీనివాస్‌ ఖండించారు. ఏడాది పాలనలో భూకబ్జా జరిగిందని నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు.

అలాగే పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో 90 శాతం తొలి ఏడాదిలోనే నెరవేర్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని.. కష్టించి పనిచేసిన కార్యకర్తలకు త్వరలోనే పదవులు ఇస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, సిటీ అధ్యక్షుడు వంశీ కృష్ణ శ్రీనివాస్, నార్త్ ఇన్ ఛార్జి కెకె రాజు, మాజీ ఎమ్మెల్యేలు రెహమాన్, కుంభా రవిబాబు, మహిళా విభాగం అధ్యక్షురాలు గరికిన గౌరి, కొయ్యా ప్రసాద రెడ్డి, శ్రీధర్రెడ్డి, కోలా గురువులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories