డ్రోన్ల వినియోగంపై స్పందించిన మంత్రి అనిల్

డ్రోన్ల వినియోగంపై స్పందించిన మంత్రి అనిల్
x
Highlights

చంద్రబాబు నివాసంపై డ్రోన్లను వినియోగించడంపై వివాదం నెలకొంది. అయితే దీనిపై వివరణ ఇచ్చారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ప్రకాశం బ్యారేజి...

చంద్రబాబు నివాసంపై డ్రోన్లను వినియోగించడంపై వివాదం నెలకొంది. అయితే దీనిపై వివరణ ఇచ్చారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ప్రకాశం బ్యారేజి వరద గంటగంటకు పెరుగుతోందని.. దీంతో వరద ప్రవాహాన్ని అంచనా వేసేందుకే డ్రోన్ల ద్వారా వీడియో తీస్తున్నామని వివరణ ఇచ్చారు. దీనిపై రాదంతం అనవసరమని చెప్పారు. ఎగువ నుంచి వచ్చే వరదతో కరకట్ట వెంబడి కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజల రక్షణ.. ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు. వరద వస్తే చంద్రబాబు ఇల్లు మునుగుతుందని ముందే చెప్పామన్న మంత్రి.. అందుకు తగ్గట్టే చర్యలు చేపట్టామన్నారు. అయితే ఆ ఇల్లు మునిగిపోతుందన్న విషయం బయట ప్రపంచానికి తెలియనీయకూడదని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మంత్రి అనిల్ దుయ్యబట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories