బోటు ప్రమాద బాధితులకు సైబర్‌ నేరగాళ్ల వల..నష్టపరిహారం పేరుతో..

బోటు ప్రమాద బాధితులకు సైబర్‌ నేరగాళ్ల వల..నష్టపరిహారం పేరుతో..
x
Highlights

ఓ వైపు విషాదం మరోవైపు సైబర్‌ చీటింగ్‌. అసలే బోటు ప్రమాదంలో తమ వారిని పోగొట్టుకుంటే, మరోవైపు డబ్బులు కాజేశాడు ఓ ప్రబుద్ధుడు. విశాఖ వేపగుంటలో నివాసముండే...

ఓ వైపు విషాదం మరోవైపు సైబర్‌ చీటింగ్‌. అసలే బోటు ప్రమాదంలో తమ వారిని పోగొట్టుకుంటే, మరోవైపు డబ్బులు కాజేశాడు ఓ ప్రబుద్ధుడు. విశాఖ వేపగుంటలో నివాసముండే బొండ లక్ష్మీ, ఆమె కుమార్తె పు‌ష్ప బోటు ప్రమాదంలో మృతి చెందారు. అయితే మృతి చెందిన వారి బంధువులకు ఓ వ్యక్తి ఫోన్‌ చేసి, తమకు నష్టపరిహారం వచ్చిందని, బ్యాంకు వివరాలు తెలపాలని కోరాడు. ఆపై మొబైల్‌కు వచ్చే ఓటీపీ వివరాలు తెలుసుకుని బాధితుని బ్యాంక్‌ నుండి 7వేల 200 రూపాయలను స్వాహా చేశాడు. ఆలస్యంగా విషయం గ్రహించిన బాధితులు మీడియాను ఆశ్రయించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories