మందుబాబులకు షాక్.. అక్కడ మద్యం అమ్మకాలు బంద్‌

మందుబాబులకు షాక్.. అక్కడ మద్యం అమ్మకాలు బంద్‌
x
Highlights

కేంద్రం ఆదేశాల మేరకు ఈ ఉదయం దేశంలోని పలు ప్రాంతాల్లో మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి. దాదాపు 7 వారాల తరువాత షాపులు తెరిచేసరికి మద్యం షాపుల వద్ద జనాలు భారీ...

కేంద్రం ఆదేశాల మేరకు ఈ ఉదయం దేశంలోని పలు ప్రాంతాల్లో మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి. దాదాపు 7 వారాల తరువాత షాపులు తెరిచేసరికి మద్యం షాపుల వద్ద జనాలు భారీ ఎత్తున లిక్కర్ కోసం క్యూ కట్టారు. ఇక మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలను పెట్టినా, చాలా చోట్ల అమలు అవ్వడంలేదు. అయితే చిత్తూరు జిల్లా పాలసముద్రంలో మాత్రం మందుబాబులకు షాక్ తగిలింది. పాలసముద్రంలో మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి.

జిల్లా సరిహద్దులోని తమిళనాడు ప్రాంత వాసులు మద్యం కొనుగోలు చేసేందుకు పాలసముద్రం రావడంతో అక్కడ మద్యం అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాలసముద్రం తమిళనాడు సరిహద్దులో ఉంటుంది. అక్కడ మద్యం దుకాణం తెరచుకోవడంతో జిల్లా సరిహద్దులోని తమిళనాడు ప్రాంత వాసులు మద్యం కొనుగోలు తరలివచ్చారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో.. అక్కడ మద్యం అమ్మకాలను నిలిపివేయాలని తమిళనాడు తహసీల్దార్లు ఏపీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దాంతో చిత్తూరు జిల్లా అధికారులు పాలసముద్రంలో మద్యం అమ్మకాలను నిలిపివేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories