బాబును పట్టుకుని కన్నీటి పర్యంతమైన శివరామ్‌

బాబును పట్టుకుని కన్నీటి పర్యంతమైన శివరామ్‌
x
Highlights

కోడెల భౌతికకాయం మరికాసేపట్లో గుంటూరు చేరుకోనుంది. భారీ కాన్వాయ్‌‌తో కోడెల పార్థివదేహాన్ని గుంటూరుకు తరలిస్తున్నారు. కోడెల పార్థివదేహం వెంట చంద్రబాబు...

కోడెల భౌతికకాయం మరికాసేపట్లో గుంటూరు చేరుకోనుంది. భారీ కాన్వాయ్‌‌తో కోడెల పార్థివదేహాన్ని గుంటూరుకు తరలిస్తున్నారు. కోడెల పార్థివదేహం వెంట చంద్రబాబు సైతం వెళ్తున్నారు. అయితే, ఇబ్రహీంపట్నం దగ్గర చంద్రబాబును కలిసిన కోడెల కుమారుడు శివరామ్ బాబును పట్టుకుని కన్నీటి పర్యంతమయ్యాడు.

కోడెల భౌతికకాయం కాసేపట్లో గుంటూరు చేరుకోనుండటంతో నర్సరావుపేటలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నర్సరావుపేటలో 144 సెక్షన్ విధించారు. అడుగడుగునా బలగాలను మోహరించగా, ఇద్దరు ఎస్పీలు, 10మంది డీఎస్సీలు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.

నర్సరావుపేటలో రేపు కోడెల అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే, కోడెల అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలతో సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు ఇచ్చారు. అధికారికంగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలంటూ డీజీపీ, గుంటూరు కలెక్టర్‌, ఎస్పీకి ఆదేశించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories