కీలకంగా మారిన కోడెల మొబైల్..గదిలో ఉన్న ఫోన్ ఎలా మాయమైంది?

కీలకంగా మారిన కోడెల మొబైల్..గదిలో ఉన్న ఫోన్ ఎలా మాయమైంది?
x
Highlights

కోడెల శివప్రసాద్ ఆకస్మిక మరణం ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది. దాంతో కోడెల ఆత్మహత్యకు ముందురోజు సాయంత్రం అసలేం జరిగిందనే దానిపై పోలీసులు...

కోడెల శివప్రసాద్ ఆకస్మిక మరణం ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది. దాంతో కోడెల ఆత్మహత్యకు ముందురోజు సాయంత్రం అసలేం జరిగిందనే దానిపై పోలీసులు దృష్టిపెట్టారు. ఇప్పటికే ఇంట్లో ఆధారాలు, ఫింగర్ ప్రింట్స్ సేకరించిన పోలీసులు కోడెల మొబైల్‌ ఫోన్ మాయం కావడంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

అయితే, కేసు దర్యాప్తులో కోడెల ఫోనే అత్యంత కీలకంగా మారింది. కోడెల మొబైల్ ఫోన్ ఎక్కడుంది? ఎందుకు అదృశ్యమైంది? కోడెలతో చివరిగా మాట్లాడిందెవరు? ఏం మాట్లాడారు? ఆ తర్వాతే మొబైల్ ఎందుకు స్విచ్ఛాఫ్ అయింది? అసలుగదిలో ఉన్న ఫోన్ ఎలా మాయమైందనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఆత్మహత్యకు ముందు రోజు నుంచి సూసైడ్ చేసుకున్న చివరి నిమిషం వరకు ఎవరెవరితో మాట్లాడారనే దానిపై ఆరా తీస్తున్నారు.

ఆత్మహత్యకు ముందు రోజు కోడెల మాట్లాడిన చివరి కాల్‌ కలకలం రేపుతోంది. 24 నిమిషాలపాటు సాగిన ఆ సంభాషణ ఎవరితో ఏం మాట్లాడారన్న దానిపై వివరాలు సేకరిస్తున్నారు. ఆ ఫోన్ కాల్ తర్వాతే కోడెల మొబైల్ స్విచ్ఛాఫ్ అయ్యిందని గుర్తించారు. ఆ ఫోన్ కాల్ తర్వాతే కోడెల డల్ అయిపోయారని, కొద్దిసేపటికే ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నారు.

కోడెల ఇంట్లో పనిమనుషులను, వాచ్ మెన్ ను ఇప్పటికే ప్రశ్నించిన పోలీసులు గన్‌మెన్లు, డ్రైవర్‌ నుంచి కూడా వాంగ్మూలం తీసుకున్నారు. ఇక, ఇప్పటికే కోడెల కూతురు విజయలక్ష్మితోపాటు కుటుంబ సభ్యులందరి స్టేట్‌మెంట్లు రికార్డు చేసిన పోలీసులు త్వరలోనే కోడెల కుమారు శివరామ్‌‌ను కూడా ప్రశ్నించనున్నారు. కోడెల అంత్యక్రియలు ముగిసిన తర్వాత శివరామ్‌ను విచారించే అవకాశం కనిపిస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories