రెండు వేళ్లు చూపెట్టిండు.. ప్రజలకు మూడు పంగనామాలు పెట్టి వెళ్లిపోయాడు: కాకాణి

రెండు వేళ్లు చూపెట్టిండు..  ప్రజలకు మూడు పంగనామాలు పెట్టి వెళ్లిపోయాడు: కాకాణి
x
Highlights

ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్దన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై అసెంబ్లీలో...

ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్దన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై అసెంబ్లీలో తూర్పారబట్టారు. పకృతి సంపదను టీడీపీ ప్రభుత్వం నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల గురించి చంద్రబాబు ఏనాడు ఆలోచించలేదని గోవర్దన్‌రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ కార్డుతో వెళ్తే ప్రజలు అవమానాల పాలయ్యారని విమర్శిచారు అధికార పక్ష ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆరోగ్యశ్రీలో అవసరమైన ఆపరేషన్లు తొలగించారని ఆరోపించారు. అయితే ఇప్పుడు వైఎస్ జగన్ పాలనలో వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఎన్ని లక్షలైన ఉచితంగా వైద్యం పొందొచ్చని చెప్పారు కాకాని.

గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో సవాళ్ల పర్వం నడిచింది. టీడీపీ పాలనలో అవినీతి, అక్రమాలు విచ్చలవిడిగా చోటుచేసుకున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతల అవినీతి నిరూపించకపోతే తన పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు. ఇసుక నుంచి మట్టి వరకు ప్రతి దానిలో దోపిడి జరిగిందన్నారు . గత 2014 ఎన్నికల సమయంలో ఏ టీవీ చూసినా బ్యాంకులవాళ్లు ఇంటికి జప్తు చేయడానికి వచ్చినట్లు, అందులోని ఇల్లాలు ఇంకో రెండు వారాలు ఆగండి ఆయన వస్తాడు అని చెప్పడం. ఎవరని చూస్తే చంద్రబాబు సైకిల్ పై రెండు వేళ్లు చూపిస్తూ నేను భరోస ఇస్తా అధికారంలోకి రావడినికి ప్రజలకు రెండు వేళ్లు చూపించిన చంద్రబాబు ప్రజలకు మూడు పంగనామాలు పెట్టి వెళ్లిపోయారు అని విమర్శించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories