జేసీ సంచలన వ్యాఖ్యలు.. మరో ఏడాదిలో వైఎస్ భారతి సీఎం..

జేసీ సంచలన వ్యాఖ్యలు.. మరో ఏడాదిలో వైఎస్ భారతి సీఎం..
x
జేసీ సంచలన వ్యాఖ్యలు.. మరో ఏడాదిలో వైఎస్ భారతి సీఎం..
Highlights

టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఏడాదిలో జగన్ సతీమణి భారతి సీఎం కావొచ్చని జోస్యం చెప్పారు. గత ఎన్నికల్లో జగన్ కు...

టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఏడాదిలో జగన్ సతీమణి భారతి సీఎం కావొచ్చని జోస్యం చెప్పారు. గత ఎన్నికల్లో జగన్ కు కేసీఆర్ ఆర్థిక సాయం చేశారని తెలిపారు. మందడంలో రైతుల దీక్షకు టీడీపీ నేతలు జేసీ, మాగంటి బాబు తదితరులు సంఘీభావం తెలిపారు. ఒకరి మూర్ఖత్వం వల్ల మనకు ఈ పరిస్థితి వచ్చిందని విమర్శలు గుప్పించారు.

విశాఖలో రాజధాని పెట్టాలంటే జగన్‌ నిర్ణయం తీసుకుంటే సరిపోదని అందరి అభిప్రాయాలను తీసుకోవాలని చెప్పుకొచ్చారు. మూడు రాజధానులు ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ శ్మశానం అవుతుందని జేసీ హెచ్చరించారు. మన రక్తాన్ని పీల్చి పిప్పిచేసి జగన్ ఆ అప్పును చెల్లించి గురు భర్తి చూపించడానికి మొన్న వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. మూడు రాష్ట్రాలు చేయ్ నేను నీకు ఉన్నానని జగన్‌కు కేసీఆర్ మద్దతు ఇచ్చారన్నారు. నిజంగా మూడు రాజధానులు ఏర్పడితే రాష్ట్రం స్మశానం కావడం ఖాయమన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories