జనసేన నేత కన్నుమూత

జనసేన నేత కన్నుమూత
x
Highlights

జవసేన నాయకుడు, నూజివీడు మున్సిపల్ మాజీ ఛైర్మన్ బసవా వైకుంఠ వెంకట భాస్కరరావు అనారోగ్యంతో మరణించాడు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన...

జవసేన నాయకుడు, నూజివీడు మున్సిపల్ మాజీ ఛైర్మన్ బసవా వైకుంఠ వెంకట భాస్కరరావు అనారోగ్యంతో మరణించాడు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు కన్నుమూశారు. అయన మృతి పట్ల పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. " జ. జనసేన నాయకుడు, నూజివీడు మునిసిపల్‌ మాజీ ఛైర్మన్‌ శ్రీ బసవా వైకుంఠ వెంకట భాస్కర రావు అకాల మరణం ఎంతో విచారకరం. మున్సిపల్‌ ఛైర్మనుగా నూజివీడు ప్రజలకు చేసిన సేవలు ఎనలేనివి. నూజివీడు ప్రాంతంలో జనసేన బలోపేతానికి ఆయన చేసిన కృషిని ఎన్నటికీ మరువలేము.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందారని తెలిసి చాలా బాధనిపించింది. సౌమ్యశీలి, మృదుస్వభావుడైన భాస్కర రావు తన సేవలతో చెరగని ముద్ర వేశారు. నా తరపున, జన సైనికుల తరపున భాస్కర రావు గారికి శ్రద్దాంజలి ఘటిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ దుఃఖ సమయంలో ఆయనకుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్దిస్తున్నాను." అని పవన్ అన్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories