రాజోలు వైసీపీలో భగ్గుమంటున్న గ్రూపు రాజకీయాలు

రాజోలు వైసీపీలో భగ్గుమంటున్న గ్రూపు రాజకీయాలు
x
Highlights

తూర్పుగోదావరి జిల్లా రాజోలు వైసీపీ పార్టీలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. గ్రూపు రాజకీయాలు తారస్థాయికి చేరాయి.

తూర్పుగోదావరి జిల్లా రాజోలు వైసీపీ పార్టీలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. గ్రూపు రాజకీయాలు తారస్థాయికి చేరాయి. మాజీ కో ఆర్డినేటర్‌ బొంతు రాజేశ్వరరావు వర్గానికి పెదపాటి అమ్మాజీ వర్గానికి మధ్య వివాదాలు ముదురుతున్నాయి. బొంతు వర్గీయులు తాటిపాక సెంటర్‌లో సమావేశమై ... తిరిగి ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించాలంటూ వైస్సార్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.

పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని విస్మరిస్తూ.. పార్టీ ఓటమి కోసం పనిచేస్తున్న వారికి పెదపాటి అమ్మాజీ పదవులు కట్టబెడుతున్నారని రాజేశ్వరరావు వర్గం ఆరోపిస్తుంది. అమ్మాజీని పార్టీ ఇంఛార్జ్‌ బాధ్యతల నుంచి తొలగిచి రాజేశ్వరరరావుకి తిరిగి బాధ్యతలు అప్పగించాలని డిమాండ్‌ చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories