జగన్ కు సీబీఐ షాక్.. సీఎం అయినా కోర్టుకు రావాల్సిందే !

జగన్ కు సీబీఐ షాక్.. సీఎం అయినా కోర్టుకు రావాల్సిందే !
x
జగన్, విజయసాయిరెడ్డి
Highlights

జగన్ ఆస్తుల కేసులపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఏ 1, ఏ 2 అయిన ఏపీ సీఎం జగన్, విజయసాయిరెడ్డి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ...

జగన్ ఆస్తుల కేసులపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఏ 1, ఏ 2 అయిన ఏపీ సీఎం జగన్, విజయసాయిరెడ్డి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌ను విచారించిన సీబీఐ న్యాయస్థానం పిటిషన్‌ను తోసిపుచ్చింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వలేమని వచ్చే శుక్రవారం హాజరుకావాల్సిందే అని స్పష్టం చేసింది. పదే పదే మినహాయింపు కోరడం పై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

ప్రజా సేవలో, ముఖ్యమంత్రి హోదాలు ఉండటంతో పాలనా పరమైన ఒత్తిళ్లు ఉండటంతో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అప్పటి నుంచి జగన్‌, విజయసాయిరెడ్డి తరపున లాయర్లు హాజరవుతూ వచ్చారు. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం పదే పదే మినహాయింపు కోరడంపై అసహనం వ్యక్తం చేసింది. వచ్చే శుక్రవారం తమ ముందు హాజరుకావాల్సిందే అని స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories