చంద్రబాబు ఎప్పుడూ నిజం చెప్పలేదు: మంత్రి సుచరిత

చంద్రబాబు ఎప్పుడూ నిజం చెప్పలేదు: మంత్రి సుచరిత
x
Highlights

టీడీపీ నిర్వహిస్తున్న సభలకు నిరసనగా గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో వైసీపీ బహిరంగ సభను నిర్వహించింది. పల్నాడు ప్రాంతంలో వైసీపీ దాడులు చేస్తుదంటూ టీడీపీ...

టీడీపీ నిర్వహిస్తున్న సభలకు నిరసనగా గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో వైసీపీ బహిరంగ సభను నిర్వహించింది. పల్నాడు ప్రాంతంలో వైసీపీ దాడులు చేస్తుదంటూ టీడీపీ గుంటూరులో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ వైసీపీ.. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు తమ కార్యకర్తలను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని ఆరోపిస్తోంది. టిడిపి భాధితులుతో వైసిపి సమావేశం ఏర్పాటు చేసింది. ఈసభకు హోంమంత్రి సుచరిత, వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు.

2014 నుంచి 19 వరకు ఏపీలో రాక్షస పాలన సాగిందని అన్నారు హోంమంత్రి సుచరిత. చంద్రబాబు పాలనలో వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్, సత్తెనపల్లి కే ట్యాక్స్ గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక బాధితులు ముందుకు వచ్చి గోడు వెళ్లబోసుకుంటున్నారని అన్నారు సుచరిత.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories