చంద్రబాబుకు జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నాం: హోంమంత్రి

చంద్రబాబుకు జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నాం: హోంమంత్రి
x
Highlights

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భద్రత తగ్గించామనడంలో వాస్తవం లేదని హోంమంత్రి సుచరిత అన్నారు మంగళవారం ఆమె మీడియాతో...

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భద్రత తగ్గించామనడంలో వాస్తవం లేదని హోంమంత్రి సుచరిత అన్నారు మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. ఇప్పటికి చంద్రబాబు తానే సీఎం అని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. విపక్ష నేతననే విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రతి అంశానికీ ఆయన రాజకీయ రంగు పులుముతున్నారని సుచరిత మండిపడ్డారు. చంద్రబాబుకు బుల్లెట్‌ ప్రూఫ్‌, ఎస్కార్ట్‌ కార్లు ఇచ్చామని, భద్రతా సమీక్ష కమిటీ చెప్పిన దానికంటే ఎక్కువ భద్రతే ఆయనకు కల్పించినట్టు ఆమె వెల్లడించారు. నిబంధనల ప్రకారం చంద్రబాబుకు 58 మంది సిబ్బందిని కేటాయించాల్సి ఉన్నా... తాము మాత్రం 74 మంది సిబ్బందిని కేటాయించామని వివరించారు. భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు కోరలేదని సుచరిత తెలిపారు. చంద్రబాబుకు చెందిన ప్రైవేటు ఆస్తులకు రక్షణ కల్పించడం కుదరదని తెలిపారు. అక్రమ కట్టడాల కూల్చివేతల అంశాన్ని పక్కదారి పట్టించేలా టీడీపీ నేతలు చంద్రబాబు భద్రతపై మాట్లాడుతున్నారని విమర్శించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories