కోడెల శివరాం షోరూమ్‌ వద్ద హైడ్రామా..!

కోడెల శివరాం షోరూమ్‌ వద్ద హైడ్రామా..!
x
Highlights

కోడెల కుమారుడి షోరూమ్ తనిఖీల సందర్భంగా హైడ్రామా చోటు చేసుకుంది. అసెంబ్లీ అధికారులు సోదాలు చేస్తుండగా కోడెల తరపు లాయర్ రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా...

కోడెల కుమారుడి షోరూమ్ తనిఖీల సందర్భంగా హైడ్రామా చోటు చేసుకుంది. అసెంబ్లీ అధికారులు సోదాలు చేస్తుండగా కోడెల తరపు లాయర్ రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తనిఖీ అధికారులను అడ్డుకున్న లాయర్ నోటీసులను లిఖితపూర్వకంగా సమర్పించాలని స్పష్టం చేశారు. అప్పుడే తనిఖీలకు అనుమతిస్తామని కోడెల తరపు లాయర్ తేల్చిచెప్పారు. అసెంబ్లీ సెక్రటరీ ఆదేశాలున్నాయని అసిస్టెంట్‌ సెక్రటరీ రాజ్‌స్పష్టం చేయడంతో రికవరీ కొనసాగింది. సుమారు 3 గంటల పాటు సోదాలు నిర్వహించిన అధికారులు అసెంబ్లీకి చెందిన ఫర్నీచర్ ను గుర్తించారు. మొత్తం 32 కుర్చీలు, 4 సోఫాలు, 3 టేబుళ్లు, ఒక టీపాయ్‌, ఒక దర్బార్‌ చైర్‌ ను గుర్తించిన అధికారులు అక్కడే పంచనామా నిర్వహించారు. తహశీల్దార్‌ మోహనరావు ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించిన అధికారులు షోరూమ్ నుంచి వెళ్లిపోయారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories