ఆ నలుగుర్ని అందుకే తీసుకున్నాం

ఆ నలుగుర్ని అందుకే తీసుకున్నాం
x
Highlights

బీజేపీలో చేరినంత మాత్రాన కేసులు మాఫీ కావని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు టీడీపీ ఎంపీ లను గతంలో...

బీజేపీలో చేరినంత మాత్రాన కేసులు మాఫీ కావని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు టీడీపీ ఎంపీ లను గతంలో అవినీతి పరులని విమర్శించి ఇప్పుడు వారినే బీజేపీలో చేర్చుకోవడంపై విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన జీవీఎల్ తమ పార్టీలో చేరినవాళ్లు మంచివాళ్లని తాను సర్టిఫికేట్ ఇవ్వలేదన్నారు. వారిపై వచ్చిన అభియోగాలకు వారే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని జీవీఎల్ స్పష్టం చేశారు. దేశాభివృద్ధిని కాంక్షించే బీజేపీలో చేరుతున్నట్టు టీడీపీ సభ్యులు తెలిపారని చెప్పారు. బీజేపీలో చేరిన తర్వాత తమ పార్టీ సిద్ధాంతాలు, విధానాలకు లోబడి పనిచేయాలన్నారు. అభియోగాలు ఉన్నవారికి తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని చెప్పారు. రాజ్యసభలో తగిన సంఖ్యాబలం లేని కారణంగానే టీడీపీ సభ్యులను చేర్చుకున్నట్టు స్పష్టంచేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories