నేను ఎక్కడికీ పారిపోలేదు.. న్యాయం కోసం పోరాటం చేస్తున్నా-హర్ష కుమార్‌

నేను ఎక్కడికీ పారిపోలేదు.. న్యాయం కోసం పోరాటం చేస్తున్నా-హర్ష కుమార్‌
x
Highlights

తాను ఎక్కడికీ పారిపోలేదని, న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని అమలాపురం మాజీ ఎంపి జివి హర్షకుమార్ అన్నారు. కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు వెలికితీసే...

తాను ఎక్కడికీ పారిపోలేదని, న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని అమలాపురం మాజీ ఎంపి జివి హర్షకుమార్ అన్నారు. కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు వెలికితీసే అంశంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని, బోటు తీయకుండా వుండేందుకు కాంట్రాక్టు ఇచ్చారా అన్పిస్తుందని వాట్సాప్‌లో మీడియాకు పంపిన వాయిస్‌లో హర్షకుమార్ పేర్కొన్నారు. తనను పట్టుకోవడం కోసం ఆరు పోలీసు బృందాలను పంపి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. బోటు ప్రమాద బాధిత కుటుంబాల ఆవేదన ప్రభుత్వం పట్టించుకోలేదని, అందువల్లే వారి తరపున తాను మాట్లాడుతున్నందుకు సిఎం జగన్ తనపై తప్పుడు కేసులుబనాయిస్తున్నారని , అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించానని హర్షకుమార్ అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories