బోటులో ఎక్కువమంది తెలంగాణవారే!

బోటులో ఎక్కువమంది తెలంగాణవారే!
x
Highlights

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు వద్ద గోదావరిలో ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ట బోటులో ప్రయాణిస్తున్న వారిలో అత్యధికులు తెలంగాణకు...

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు వద్ద గోదావరిలో ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ట బోటులో ప్రయాణిస్తున్న వారిలో అత్యధికులు తెలంగాణకు చెందినవారిగా తెలుస్తోంది. పాపికొండల అందాలను చూసేందుకు హైదరాబాద్ నుంచి 22 మంది, వరంగల్ నుంచి 15 మంది ఈ యాత్రకు బయలుదేరి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇక​ ఈ ప్రమాదం నుంచి వరంగల్‌ కాజీపేటకు చెందిన గొర్రె ప్రభాకర్‌ సహా పలువురు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ వారికి వైద్య సహాయం అందిస్తున్నారు. ఇక గల్లంతు అయినవారిలో 27మంది సురక్షితంగా బయటపడ్డారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పాపికొండల యాత్రకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన గాంధీ, విశాల్, లక్ష్మణ్, జానకిరామ్,రాజేష్, రఘరామ్, అబ్దుల్ సలీమ్, సాయికుమార్, రఘురామ్, విష్ణుకుమార్, మహేశ్వరరెడ్డి కుటుంబం, వరంగల్‌కు చెందిన వరంగల్, విశాఖకు చెందిన రమణ, తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు చెందిన జగన్ గల్లంతయినట్టుగా తెలుస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories