పోటీ ఇవ్వలేని టీడీపీ ఎందుకు పోటీ చేసింది? : వల్లభనేని వంశీ

పోటీ ఇవ్వలేని టీడీపీ ఎందుకు పోటీ చేసింది? : వల్లభనేని వంశీ
x
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తన ఓటు హక్కు వినియోగించుకున్న...

టీడీపీ అధినేత చంద్రబాబుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఇప్పటికైనా తన వద్ద ఉన్న చెంచాలను పక్కన పెట్టాలని సూచించారు. పోటీ ఇవ్వలేని టీడీపీ ఎందుకు పోటీ పెట్టిందని ప్రశ్నించారు.

పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత.. తనను ఓటు అడగడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ఓడిపోయే స్థానంలో వర్ల రామయ్యను పోటీకి దించి దళితులను చంద్రబాబు అవమాన పరిచారని విరుచుకుపడ్డారు వంశీ. కరోనా సమయంలో అసెంబ్లీ, పదో తరగతి పరీక్షలు ఎందుకన్న చంద్రబాబు.. ఈ సమయంలో రాజ్యసభ ఎన్నికలకు కారణం ఆయనేనని వంశీ అన్నారు. 23 మంది సభ్యులు ఉంటే 17 ఓట్లు పడ్డాయన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories