తప్పిన ప్రమాదం : 25 మంది విద్యార్థులున్న పాఠశాల బస్సు దగ్ధం..

తప్పిన ప్రమాదం : 25 మంది విద్యార్థులున్న పాఠశాల బస్సు దగ్ధం..
x
School bus
Highlights

పశ్చిమ గోదావరి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది.. దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని నిర్మలగిరి పాఠశాలకు చెందిన బస్సు

పశ్చిమ గోదావరి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది.. దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని నిర్మలగిరి పాఠశాలకు చెందిన బస్సు 25 మంది విద్యార్థులతో కలిసి చాగల్లు బయల్దేరింది. ఈ క్రమంలో బస్సు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు బస్సు అంతటా వ్యాపించాయి. దీనితో వెంటనే అప్రమత్తం అయిన బస్సు డ్రైవర్ బస్సును రోడ్డుపైన ఆపేసి హుటాహుటిన విద్యార్దులను బస్సు నుంచి కిందికి దించాడు. ఈ ప్రమాదంలో పాఠశాలకి సంబంధించిన బస్సు దగ్ధమైంది. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ జరగలేదు.

ఈ ఘటన మీనానగరం వద్ద జరిగింది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందిని సంప్రదించగా వారు వెంటనే ఘటనా ప్రదేశానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ మంటల్లోనే బస్సు పూర్తిగా కాలిపోయంది . షాట్ సర్క్యూట్ వలెనే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను తెలుసుకున్నారు. ఈ ఘటనతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories