నాటు సారా కేంద్రాలపై మెరుపు దాడులు

నాటు సారా కేంద్రాలపై మెరుపు దాడులు
x
నాటు సారా కేంద్రాలపై మెరుపు దాడులు
Highlights

ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు పంపిణీని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏపీలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీస్, ఎక్సైజ్ శాఖ మెరుపు...

ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు పంపిణీని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏపీలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీస్, ఎక్సైజ్ శాఖ మెరుపు దాడులు చేస్తోంది. పోలీస్, ఎక్సైజ్ శాఖ సమన్వయంతో నాటు సారా తయారీ కేంద్రాలపై ఉదయం 4 గంటల నుండి దాడులు చేస్తున్నారు. పదివేల మంది సిబ్బందితో తనిఖీలు కొనసాగుతున్నాయి.

వందలాది మంది పోలీస్ అధికారులతో కూడిన బృందాలతో, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు, ప్రొబేషనరీ ఐపీఎస్, సీఐలు,ఎస్సైలు, పది వేల మంది సిబ్బందితో రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు దాడులు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో భారీగా నాటుసారా నిల్వలు ధ్వంసం చేశారు. ప్రత్తాపాడు, రాజమండ్రి రూరల్ ప్రాంతాలలో పెద్ద మొత్తంలో బెల్లం ఊట నిల్వలు, నాటుసారా నిల్వలను గుర్తించారు. ఎన్నికల్లో పూర్తిగా మద్యం, డబ్బు పంపిణీని కట్టడి చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులు చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories