శిశువులకు తల్లి పాలే శ్రేయస్కరం: మంత్రి వెలంపల్లి శ్రీనివాస్

శిశువులకు తల్లి పాలే శ్రేయస్కరం: మంత్రి వెలంపల్లి శ్రీనివాస్
x
Highlights

శిశువులకు తల్లి పాలు మంచిదని, డబ్బా పాలు వాడొద్దని సూచించారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. నేడు ఇండియన్ అకాడమీ పిరియాడిక్ కృష్ణా...

శిశువులకు తల్లి పాలు మంచిదని, డబ్బా పాలు వాడొద్దని సూచించారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. నేడు ఇండియన్ అకాడమీ పిరియాడిక్ కృష్ణా జిల్లా విభాగం ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన తల్లి పాల వారోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ అకాడమీ పిరియాడిక్ అసోసియేషన్ రూపొందించిన ఓ యాప్‌ను మంత్రి వెల్లంపల్లి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, తల్లిపాలు ఇవ్వడం వల్ల శిశువులు ఆరోగ్యంగా ఉంటారని, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. కాగా అనంతరం, బందరు రోడ్డులోని ఐఎంఏ హాల్ నుంచి పాత గవర్నమెంట్ హాస్పిటల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పలువురు వైద్యులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories