కాకినాడలో సినీ దర్శకుడు వంశీ నల్లమిల్లోరిపాలెం పుస్తకావిష్కరణ

కాకినాడలో సినీ దర్శకుడు వంశీ నల్లమిల్లోరిపాలెం పుస్తకావిష్కరణ
x
Highlights

సినీ దర్శకుడు వంశీ రచించిన నల్లమిల్లూరిపాలెం కథలు పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది.

సినీ దర్శకుడు వంశీ రచించిన నల్లమిల్లూరిపాలెం కథలు పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. కాకినాడలో ఆదిత్య విద్యాసంస్థల ఆడిటోరియంలో జరిగిన ఈ పుస్తకావిష్కరణలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అట్టహాసంగా జరిగిన ఈ వేడుకల్లో ఆదిత్య విద్యాసంస్థల అధినేత నల్లిమిల్లి శేషారెడ్డికి ఈ పుస్తకాన్ని అంకిమిచ్చారు రచయిత వంశీ. కలర్‌ఫుల్‌గా జరిగిన వేడుకల్లో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మెంబర్‌ రామ్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

సినీ వినీలాకాశంలో తనదైన శైలిలో సినిమాలు చేస్తూ... మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి వంశీ అని కొనియాడారు. అద్భుత చిత్రాలు తీసి తూర్పుగోదావరి జిల్లాకే వన్నే తెచ్చిన వంశీకి పద్మశ్రీ అవార్డుతో ప్రభుత్వం సత్కరించాలని అందరూ ఆకాంక్షించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories