ఐటీపైనా ఏపీ అసెంబ్లీలో డైలాగ్ వార్‌

ఐటీపైనా ఏపీ అసెంబ్లీలో డైలాగ్ వార్‌
x
Highlights

ఐటీ డెవలప్‌‌మెంట్‌పైనా ఏపీ అసెంబ్లీలో డైలాగ్ వార్ నడిచింది. ఐటీ అభివృద్ధికి చంద్రబాబు కృషిచేస్తే, ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ టీడీపీ...

ఐటీ డెవలప్‌‌మెంట్‌పైనా ఏపీ అసెంబ్లీలో డైలాగ్ వార్ నడిచింది. ఐటీ అభివృద్ధికి చంద్రబాబు కృషిచేస్తే, ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ టీడీపీ సభ్యులు నిప్పులు చెరిగారు. 2018తో పోలిస్తే, కనీసం సగం కూడా నిధులు కేటాయించలేదన్న తెలుగుదేశం ఆరోపణలకు అధికార పార్టీ ఘాటుగా రిప్లై ఇచ్చింది.

ఐటీపైనా ఏపీ అసెంబ్లీలో డైలాగ్ వార్‌ నడిచింది. చంద్రబాబు తన అనుభవంతో ఎన్నో ఐటీ కంపెనీలను రాష్ట్రానికి రప్పించి పెద్దఎత్తున యువతకు ఉద్యోగావశాలు కల్పించారని, కానీ వైసీపీ ప్రభుత్వం ఐటీకి మినిమం కేటాయింపులు కూడా చేయలేదని టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ ఆరోపించడంతో, అధికార పార్టీ ఘాటుగా రిప్లై ఇచ్చింది.

తెలుగుదేశం సభ్యులపై సెటైర్లు పేల్చిన ఆర్ధికమంత్రి బుగ్గన టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐటీకి జరిగిన అన్యాయాన్ని లెక్కలతో సహా వివరించారు. చివరిగా సమాధానమిచ్చిన ఐటీ మినిస్టర్ మేకపాటి గౌతమ్‌‌రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేలు కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వరల్డ్‌ బెస్ట్‌ ఇంక్యుబేటర్‌ కంపెనీలను ఏపీకి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories