ఏపీలో 40కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో 40కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 40కి చేరింది. 12 గంటల్లో 17 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం...

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 40కి చేరింది. 12 గంటల్లో 17 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. బాధితుల్లో ఢిల్లీలో మత పరమైన ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారే ఎక్కువమంది ఉన్నారని ప్రభుత్వం హెల్త్‌ బులెటిన్‌లో తెలిపింది.

17 మందిలో ఎనిమిది మంది ప్రకాశం జిల్లా, అనంతపురానికి చెందిన వారు ఇద్దరు, ఐదుగురు గుంటూరు, ఒకరు కృష్ణా జిల్లా వాసి కాగా మరొకరు తూర్పు గోదావరికి చెందిన వారు ఉన్నారు. ప్రకాశం జిల్లా కేసుల్లో ఐదుగురు చీరాలకు చెందిన వారే కావడం గమనార్హం. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఈ రోజు ఉదయం వరకు 164 మందిని పరీక్షించగా 147 మందికి నెగటివ్ వచ్చిందని, మిగతా వారికి పాజిటివ్ వచ్చిందని ఏపీ ప్రభుత్వం మెడికల్ బులిటెన్ విడుదల చేసింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories