శ్రీకాకుళం జిల్లాలో ఉద్రిక్తత... వీధి రౌడీల్లా కొట్టుకున్న కాలేజ్ స్టూడెంట్స్

శ్రీకాకుళం జిల్లాలో ఉద్రిక్తత... వీధి రౌడీల్లా కొట్టుకున్న కాలేజ్ స్టూడెంట్స్
x
శ్రీకాకుళం జిల్లాలో ఉద్రిక్తత... వీధి రౌడీల్లా కొట్టుకున్న కాలేజ్ స్టూడెంట్స్
Highlights

శ్రీకాకుళం జిల్లా పాలకొండ ప్రధాన రహదారిపై ఉద్రిక్తత ఏర్పడింది. ఒకే కళాశాలకు చెందిన రెండు వర్గాల విద్యార్థులు నడిరోడ్డుపై బాహాబాహీకి దిగారు....

శ్రీకాకుళం జిల్లా పాలకొండ ప్రధాన రహదారిపై ఉద్రిక్తత ఏర్పడింది. ఒకే కళాశాలకు చెందిన రెండు వర్గాల విద్యార్థులు నడిరోడ్డుపై బాహాబాహీకి దిగారు. పాలకొండలోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి రెండో సంవత్సరం విద్యార్థిని బైక్‌తో ఢీకొట్టడంతో వివాదం చెలరేగినట్లు తెలిసింది.

సీనియర్ విద్యార్థిని ఢీ కొంటావా అంటూ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ పై దాడికి దిగారు. తనను కొట్టారన్న కోపంతో మొదటి సంవత్సరం విద్యార్థి తన స్నేహితులతో కలిసి సీనియర్ విద్యార్థిపై దాడికి దిగారు. నడిరోడ్డుపై రెండు వర్గాలు చెలరేగిపోయాయి. స్థానికులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసినా గొడవ ఆగలేదు. విద్యార్థుల ఘర్షణతో రోడ్డుపై గంటసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పాలకొండలో జరిగిన ఈ ఘటన హాట్‌టాపిక్ అయ్యింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories