జగన్ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కౌంటర్

జగన్ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కౌంటర్
x
Highlights

సభను తప్పుదోవ పట్టించి అవాస్తవాలు చెప్పారన్నారు టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు. సభలో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రికి తెలియడం లేదన్నారు. సీఎం జగన్‌కు కూడా...

సభను తప్పుదోవ పట్టించి అవాస్తవాలు చెప్పారన్నారు టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు. సభలో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రికి తెలియడం లేదన్నారు. సీఎం జగన్‌కు కూడా బుద్ధి పెరగాలని అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. రైతులకు చిల్లి గవ్వ ఇవ్వలేదని సీఎం అన్నారని ఏ సంవత్సరం ఎంత ఇచ్చామో అంకెలతో సహా చెప్పామని తెలిపారు. సున్నా వడ్డీ రుణాలపై సీఎం అబద్దాలు చెప్పారని అన్నారు. రుణ మాఫీ కోసం మూడు విడతలుగా 15వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబ్బు చెల్లించామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

సీఎం జగన్ మాటమీద నిలబడే నాయకుడు అయితే 5 కోట్ల మంది ప్రజలకు క్షమాపణ చెప్పాలని, జగన్‌కు పౌరుషం ఉంటే రాజీనామా చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ప్రతిపక్షాన్ని గౌరవించడం సీఎం జగన్‌ నేర్చుకోవాలని, వెటకారంగా మాట్లాడడం, చెయ్యి ఎత్తడం సరికాదన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories