మనం నాటే ప్రతి మొక్క భూమాతకు మేలు చేస్తుంది : సీఎం జగన్

మనం నాటే ప్రతి మొక్క భూమాతకు మేలు చేస్తుంది : సీఎం జగన్
x
Highlights

మనం నాటే ప్రతి మొక్క భూమాతకు మేలు చేస్తుందని అన్నారు ఏపీ సీఎం జగన్. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రులో ప్రభుత్వం ఆధ్వర్యంలో 70వ వనమహోత్సవ...

మనం నాటే ప్రతి మొక్క భూమాతకు మేలు చేస్తుందని అన్నారు ఏపీ సీఎం జగన్. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రులో ప్రభుత్వం ఆధ్వర్యంలో 70వ వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొన్నారు. మొక్కలు నాటి అటవీశాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను సీఎం ప్రారంభించారు. మనం పెంచే ప్రతి చెట్టు తర్వాతి తరానికి ఫలాలు ఇస్తోందన్నారు. ఈ సీజన్‌లో 25 కోట్ల మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టినట్లు జగన్‌ వెల్లడించారు. ఇప్పటికే 4 కోట్ల మొక్కలు నాటామని ఈ ఒక్క రోజే కోటి మొక్కలు నాటుతున్నట్లు ప్రకటించారు. మొక్కలు పెంచేందుకు ముందుకొస్తే గ్రామ వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories