తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం

తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం
x
Highlights

తాడేపల్లిలో వైసీపీ కొత్త రాష్ట్ర కార్యాలయం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా శనివారం ఉదయం నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.

తాడేపల్లిలో వైసీపీ కొత్త రాష్ట్ర కార్యాలయం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా శనివారం ఉదయం నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌, పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్‌ చేత రిబ్బన్‌ కట్‌ చేయించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంలోని అన్ని విభాగాలను పరిశీలించారు. మూడు అంతస్తుల్లో పార్టీ కార్యాలయం నిర్మించారు. మొదటి ఫ్లోర్‌లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండవ ఫ్లోర్‌లో పార్టీ అనుబంధ విభాగాలు పనిచేయనున్నాయి. మూడవ ఫ్లోర్‌‌లో పార్టీ అధ్యక్షుడు జగన్‌కు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డికి, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులకు ఛాంబర్లు ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories