మాట్లాడదామంటే మైక్ కట్ చేస్తున్నారు: చంద్రబాబు

మాట్లాడదామంటే మైక్ కట్ చేస్తున్నారు: చంద్రబాబు
x
Highlights

వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పటి వరకు టీడీపీ కార్యకర్తలపై 285 దాడులు జరిగాయని, 65 ఆస్తులు...

వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పటి వరకు టీడీపీ కార్యకర్తలపై 285 దాడులు జరిగాయని, 65 ఆస్తులు ధ్వంసం చేశారని, 11 భూకజ్బాలు చేశారని, 24 చోట్ల కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించారని, ఏడు హత్యలు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. 75ఏళ్ల వయస్సున్న వారిపై కూడా కేసులు పెట్టారని అన్నారు. ప్రభుత్వం ప్రజలకు భద్రత , భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. టీడీపీ కార్యకర్తలను కాపాడుకుంటామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీలో చర్చకు అవకాశం ఇవ్వడం లేదని, మాట్లాడదామంటే స్పీకర్ మైక్‌ కట్ చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణుల దౌర్జన్యాలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories