సీఎం జగన్మోహన్రెడ్డి పరిపాలనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు సెటైర్లు వేశారు. పోలవరం ప్రాజెక్టు, గోదావరి వరదలపై ప్రభుత్వ తీరును తప్పుబట్టిన చంద్రబాబు మీకు చేతగాని ప్రతీ పనికీ నన్ను విమర్శించడం మాని, ఇప్పటికైనా పరిపాలన ఎలా చేయాలో నేర్చుకోండంటూ నిప్పులు చెరిగారు.
సీఎం జగన్మోహన్రెడ్డి పరిపాలనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు సెటైర్లు వేశారు. పోలవరం ప్రాజెక్టు, గోదావరి వరదలపై ప్రభుత్వ తీరును తప్పుబట్టిన చంద్రబాబు మీకు చేతగాని ప్రతీ పనికీ నన్ను విమర్శించడం మాని, ఇప్పటికైనా పరిపాలన ఎలా చేయాలో నేర్చుకోండంటూ నిప్పులు చెరిగారు. గోదావరి వరద వస్తుందని, ప్రభావిత గ్రామాలను ఖాళీ చేయించాలని రెండు నెలల ముందే పోలీస్, రెవెన్యూ యంత్రాంగాలను అధికారులను అప్రమత్తం చేశారని, మరి ఈ మేధావులు ఇన్నాళ్లూ ఏం చేశారంటూ చంద్రబాబు ప్రశ్నించారు.
ఇక పోలవరంపైనా ప్రభుత్వ తీరును చంద్రబాబు ఎండగట్టారు. పోలవరంలాంటి ప్రాజెక్టు కట్టడం అంటే, కాంట్రాక్టర్లను బెదిరించడం, బెట్టింగ్లు నిర్వహించడమంత సులభం అన్నట్టుగా కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాఫర్ డ్యామ్ కట్టడం వల్లే, ఈరోజు గ్రామాలు మునిగిపోయాయంటూ కొత్తగా ఇరిగేషన్ పాఠాలు చెబుతున్నారంటూ జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రతి ప్రాజెక్టు నిర్మాణంలో టెక్నికల్ కమిటీలు ఉంటాయని, అలాగే కేంద్ర పర్యవేక్షణ, సీడబ్ల్యూసీ నిబంధనల ప్రకారం నిర్మాణం ఉంటుందన్న చంద్రబాబు ఈ విషయాలను సదరు మేధావులు తెలుసుకోవాలని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
గోదావరి వరద వస్తుందని, ప్రభావిత గ్రామాలను ఖాళీ చేయించాలని రెండు నెలల ముందే పోలీస్, రెవిన్యూ యంత్రాంగాలను అధికారులు అప్రమత్తం చేశారు. మరి ఈ మేధావులు ఇన్నాళ్ళూ ఏం చేశారు? మీకు చేతకాని ప్రతి పనికీ నన్ను చూపించడం మాని, ఇప్పటికైనా పరిపాలన ఎలా చెయ్యాలో నేర్చుకోండి.
— N Chandrababu Naidu (@ncbn) August 12, 2019
ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రతి విషయంలో టెక్నికల్ కమిటీలు ఉంటాయి. కేంద్ర పర్యవేక్షణ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, CWC నిబంధనల ప్రకారం నిర్మాణం ఉంటుంది. ఇంజనీర్లు, అనుభవజ్ఞులు ఎంతో ఆలోచించి, కష్టపడి డిజైన్లను అందిస్తారు. ఈ విషయాలను సదరు మేధావులు తెలుసుకోవాలి.
— N Chandrababu Naidu (@ncbn) August 12, 2019
పోలవరంలాంటి ప్రాజెక్ట్ కట్టడం అంటే, కాంట్రాక్టర్లను బెదిరించడం, బెట్టింగ్ లు నిర్వహించడం అంత సులభం అన్నట్టుగా కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు. కాఫర్ డ్యాం కట్టటం వల్లే, ఈ రోజు గ్రామాలు మునిగిపోయాయంటూ కొత్తగా ఇరిగేషన్ పాఠాలు చెబుతున్నారు. pic.twitter.com/tMAVFbnlw9
— N Chandrababu Naidu (@ncbn) August 12, 2019
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire