చంద్రబాబు ఇల్లూ అక్రమ కట్టడమే: విజయసాయి

చంద్రబాబు ఇల్లూ అక్రమ కట్టడమే: విజయసాయి
x
Highlights

టీడీపీ అధినేత అమరావతిలో నివాసముంటున్న ఇల్లూ అక్రమ కట్టడమేనని వైసీపీ ఎంపీ, దిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి విజయసాయి రెడ్డి ఆరోపించారు....

టీడీపీ అధినేత అమరావతిలో నివాసముంటున్న ఇల్లూ అక్రమ కట్టడమేనని వైసీపీ ఎంపీ, దిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి విజయసాయి రెడ్డి ఆరోపించారు. లింగమనేని ఎస్టేట్‌ నుంచి ఆయన తక్షణమే ఖాళీ చేయాలని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ హయాంలో కట్టారనే వ్యాఖ్యలతో తప్పించుకోలేరని.. నదీ గర్భంలోని భవనాన్ని కూల్చడం తప్ప మరో పరిష్కారం లేదని పేర్కొన్నారు. ప్రజావేదిక రేకుల షెడ్డులా కనిపిస్తోందని.. సినిమా సెట్టింగుల్లో వాడే పీవోపీనే ఎక్కువగా వాడినట్లు ఉందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రూ.కోటి ఖర్చయ్యే నిర్మాణానికి రూ.9కోట్లు ఖర్చు చూపించారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో కట్టినవన్నీ ఇలాగే ఉంటాయనిపిస్తుందని ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories