సీఎం జగన్ బాధ్యతరహితంగా మాట్లాడారు : చంద్రబాబు

సీఎం జగన్ బాధ్యతరహితంగా మాట్లాడారు : చంద్రబాబు
x
chandrababu (File photo)
Highlights

కరోనా ప్రపంచాన్ని బయపెడుతుందని అన్నారు టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు.

కరోనా ప్రపంచాన్ని బయపెడుతుందని అన్నారు టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు.. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. 147 దేశాల్లో కరోనా ఉందని, కరోనా గ్లోబల్ వైరస్ గా మారిందని అన్నారు. ఇక ఇప్పటికే who కరోనాని విపత్తుగా ప్రకటించిందని అన్నారు. ఇప్పటికి కరోనాతో 5,500 మంది చనిపోయారని, 72,042 మంది కోలుకున్నారని అన్నారు.

లండన్ లో కూడా స్థానిక ఎన్నికలను నిలిపివేశారని, చైనా, జపాన్ లో మెడికల్ షాపులు తప్ప అన్ని మూసివేశారని అన్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికి అమెరికా రూ.3.50లక్షల కోట్లు కేటాయించిందని చంద్రబాబు వివరించారు. ఇక దీనిపై ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ 60 ఏళ్ళు పై బడిన వారికే ఈ వ్యాధి వస్తుందని అంటూ బాధ్యతరహితంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఇక గత రెండు రోజుల క్రితం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా పెద్ద సమస్య కాదని చెప్పి , ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి సినిమా హాల్స్, స్కూల్స్, షాపింగ్ మాల్స్ ముసివేశారని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories