విజయవాడ విమానాశ్రయంలో చంద్రబాబుకు తనిఖీలు

విజయవాడ విమానాశ్రయంలో చంద్రబాబుకు తనిఖీలు
x
Highlights

జెడ్‌ ప్లస్ కేటగిరిలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ..విజయవాడ విమానాశ్రయంలో పోలీసులు తనిఖీలు చేశారు. హైదరాబాద్ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్ పోర్టు...

జెడ్‌ ప్లస్ కేటగిరిలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ..విజయవాడ విమానాశ్రయంలో పోలీసులు తనిఖీలు చేశారు. హైదరాబాద్ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న ఆయన వాహనాన్ని విమానాశ్రయంలోకి అధికారులు అనుమతించలేదు. సామాన్య ప్రయాణీకుడి తరహాలో లోనికి వచ్చిన చంద్రబాబును సిబ్బంది తనిఖీ చేసి అనుమతించారు. అనంతరం ఎయిర్ పోర్టు లాంజ్ నుంచి విమానం వరకు సాధారణ ప్రయాణీకులు వెళ్లే వాహనంలోనే ప్రయాణించారు. వీఐపీ, జడ్ ప్లస్ కేటగిరిలో ఉన్నా ప్రత్యేక వాహనం కేటాయించకపోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడి భద్రతపై ఆందోళన చెందుతున్నారు. అయితే చంద్రబాబుకు తాము ఎలాంటి భద్రత తగ్గించలేదని పోలీస్ శాఖ ప్రకటించింది. ముఖ్యమంత్రి హోదాలో నియమించిన అదనపు సిబ్బందిని మాత్రమే తగ్గించామంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories