విశాఖలో భూ దందా కోసమే రాజధాని మార్పు : కన్నా

విశాఖలో భూ దందా కోసమే రాజధాని మార్పు : కన్నా
x
విశాఖలో భూ దందా కోసమే రాజధాని మార్పు : కన్నా
Highlights

మూడు రాజధానుల నిర్ణయంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయం ప్రజా వ్యతిరేకమన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా...

మూడు రాజధానుల నిర్ణయంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయం ప్రజా వ్యతిరేకమన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎన్నికల ముందు ఏం చెప్పారు ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ప్రజా వ్యతిరేక నిర్ణయమేనన్నారు.

ప్రజాసంకల్ప యాత్రలో పడిన బాధలను ఇప్పుడు ప్రజలపై రుద్దుతున్నారన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు మంచి చేస్తానంటూ హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. విశాఖలో భూ దందా కోసమే రాజధానిని మార్చారని ఆరోపించారు. త్వరలో జనసేనతో కలిసి రాజధాని మార్పుపై ప్రజల తరఫున బీజేపీ పోరాటం చేస్తోందని చెప్పారు. స్వార్థప్రయోజనాలకు వైసీపీ ప్రాధాన్యత ఇస్తోందన్న ఎంపీ జీవీఎల్‌ అసెంబ్లీ ఒక్కటే ఉంటే రాజధాని అంటారా అని ప్రశ్నించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories