ప్రజాధనాన్ని కాపాడటానికి ప్రతి ఐదు రోజులకూ కమిటీ సమావేశం

ప్రజాధనాన్ని కాపాడటానికి ప్రతి ఐదు రోజులకూ కమిటీ సమావేశం
x
Highlights

గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలను వెలికి తీయడానికి ఏర్పాటు చేసిన కేబినేట్ సబ్ కమిటీ ప్రతి ఐదు రోజులకూ ఒకసారి సమావేశం అవుతుందని మంత్రి...

గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలను వెలికి తీయడానికి ఏర్పాటు చేసిన కేబినేట్ సబ్ కమిటీ ప్రతి ఐదు రోజులకూ ఒకసారి సమావేశం అవుతుందని మంత్రి కన్నబాబు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, భూ కేటాయింపులు, ప్రాజెక్టులపై సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్టు చెప్పారు మంత్రి కన్నబాబు. ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి జరిగిందని, వాటిని నిగ్గుతేల్చుతామని చెప్పారు. ప్రజాధనాన్ని కాపాడటం కోసమే సమీక్ష చేస్తున్నామని, ఇందులో కక్షసాధింపు ఏమీలేదన్నారు. ప్రతి ఐదు రోజులకోసారి సబ్ కమిటీ భేటీ అవుతుందని, 15రోజులకోసారి సీఎం హాజరవుతారని, అన్ని శాఖల్లో విచారణ ఉంటుందని చెప్పారు కన్నబాబు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories