బస్సుపై పడిన కరెంట్ పోల్..తప్పిన పెను ప్రమాదం..

బస్సుపై పడిన కరెంట్ పోల్..తప్పిన పెను ప్రమాదం..
x
Highlights

అనంతపురం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. బళ్లారినుంచి కళ్యాణదుర్గం వైపు విద్యార్థులు సహా60 మందికిపైగా ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సు కల్యాణదుర్గం...

అనంతపురం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. బళ్లారినుంచి కళ్యాణదుర్గం వైపు విద్యార్థులు సహా60 మందికిపైగా ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సు కల్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లి, హులికలు గ్రామాల మధ్యకు రాగానే విద్యుత్ స్తంభం విరిగిపడింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఎలాంటి నష్టం జరగలేదు. ప్రమాదం జరిగిన గంట తర్వాత వచ్చిన విద్యుత్ అధికారులు స్తంభాన్ని తొలగించారు. అయితే, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ విద్యుత్ ఉండి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories