బిస్కెట్లు ఎత్తుకెళ్లిన కోతి వెంటపడి చివరకు...

బిస్కెట్లు ఎత్తుకెళ్లిన కోతి వెంటపడి చివరకు...
x
Highlights

తన దూకాణంలో బిక్కెట్ ప్యాకెట్లు ఎత్తుకెళ్లిన కోతిని తరమి బిస్కెట్ల ప్యాకెట్లు వెనక్కి తిసుకొద్దాం అనుకున్నాడు. కానీ అనుకోకుండా అక్కడే ఉన్న కరెంట్...

తన దూకాణంలో బిక్కెట్ ప్యాకెట్లు ఎత్తుకెళ్లిన కోతిని తరమి బిస్కెట్ల ప్యాకెట్లు వెనక్కి తిసుకొద్దాం అనుకున్నాడు. కానీ అనుకోకుండా అక్కడే ఉన్న కరెంట్ తీగలు తగిలి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా ముదిగుబ్బలో గురువారం చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే ముదిగుబ్బలోని పెద్దమ్మ ఆలయం వద్ద రాజు(25) చిరువ్యాపారం చేస్తుంటాడు. అయితే గురువారం రాజు దుకాణంలోకి ప్రవేశించిన ఓ కోతి బిస్కెట్‌ ప్యాకెట్లు ఎత్తుకెళ్లి సమీపంలోని రేకులషెడ్డు పైకి చేరుకుంది. వెంటనే రాజు దాన్ని అదిలించేందుకు ఆ షెడ్డుపైకి ఎక్కాడు ఈ క్రమంలోనే అక్కడే ఉన్న 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కుమారుడి మృతదేహాన్ని చూసిన రాజు తల్లిదండ్రులు నాగలక్ష్మి, గంగన్న కన్నీరుమున్నీరయ్యారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories