చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు : మంత్రి బొత్స ఫైర్‌

చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు : మంత్రి బొత్స ఫైర్‌
x
మంత్రి బొత్స
Highlights

చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా విధ్వంసాలు...

చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా విధ్వంసాలు సృష్టించడం చంద్రబాబుకు అలవాటని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవలేమనే చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. పోలీసులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు బెదిరింపులకు బయపడే వారు ఎవరూ లేరనన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నామినేషన్లు ముగిశాయని, పట్టణ ప్రాంతంలో నామినేషన్ల ప్రక్రియ మొదలైందన్నారు. ఒక‍్క టీడీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సమాయత్తంగా ఉన్నాయన్నారు.

టీడీపీ నాయకులు రౌడీయిజం చేయడానికే మాచర్ల వెళ్లారని వ్యాఖ్యానించారు. ఎన్నికల పర్యవేక్షణకు వెళ్లినవారు వీధుల్లో రయ్‌ రయ్‌ అంటూ వెళ్లారన్నారు. రోడ్డుపై ఉన్న వృద్ధులు, పిల్లలను పట్టించుకోకుండా వేగంగా వెళ్లారన్నారు. ఈ సందర్భంగా ఒక చిన్న పిల్లాడికి వాహనం తగిలిందని, దాంతో స్థానికులు ఆగ్రహం వ్యక‍్తం చేశారన్నారు. చంద్రబాబు భాషని, వ్యవహార శైలిని అదుపులో పెట్టుకోవాలని బొత్స అన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories