ఏపీ గవర్నర్‌గా ప్రమాణం చేసిన విశ్వభూషణ్‌

ఏపీ గవర్నర్‌గా ప్రమాణం చేసిన విశ్వభూషణ్‌
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ ఆయన చేత...

ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ ఆయన చేత రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్‌, సీజే, సీఎం జగన్‌ తేనీటి విందులో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ గవర్నర్‌కు అతిథులను పరిచయం చేయనున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories