రేవ్ పార్టీలు, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతాం: అవంతి శ్రీనివాస్

రేవ్ పార్టీలు, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతాం: అవంతి శ్రీనివాస్
x
Highlights

రేవ్ పార్టీలు, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామన్నారు పర్యాటక శాఖ మంత్రిగా అవంతి శ్రీనివాస్‌. సచివాలయం మూడో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో పర్యాటక శాఖ మంత్రిగా...

రేవ్ పార్టీలు, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామన్నారు పర్యాటక శాఖ మంత్రిగా అవంతి శ్రీనివాస్‌. సచివాలయం మూడో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో పర్యాటక శాఖ మంత్రిగా అవంతి శ్రీనివాస్‌ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పర్యాటక కార్పొరేషన్‌ తరహాలో ఆర్కియాలజీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తూ మంత్రి తొలి సంతకం చేశారు.13 జిల్లాల్లో టూరిజం స్పాట్లను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. సింగిల్‌ విండో పద్దతిలో అనుమతులిస్తామని వివరించారు. ఏపీ టూరిజంకు బ్రాండ్‌ అంబాసిడర్‌ను నియమిస్తామన్నారు. ఏపీకి వచ్చే టూరిస్టులకు అన్ని విధాలుగా భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. తనకు ఈ అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలను తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories