మచిలీపట్నంలో ఆశా వర్కర్ ఆత్మహత్యాయత్నం..

మచిలీపట్నంలో ఆశా వర్కర్ ఆత్మహత్యాయత్నం..
x
Highlights

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆశా వర్కర్ జయలక్ష్మి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. అంగన్‌ వాడి టీచర్ మట్టా తులసి, ఆశా వర్కర్ ఏసుకుమారి, మరో...

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆశా వర్కర్ జయలక్ష్మి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. అంగన్‌ వాడి టీచర్ మట్టా తులసి, ఆశా వర్కర్ ఏసుకుమారి, మరో వ్యక్తి వెంకటేశ్వరరావు వేధింపులు తాళ లేక ఆత్మహత్య చేసుకుంటున్నానని జయలక్ష్మీ లెటర్ రాసింది. జయలక్ష్మీ గతంలో టీడీపీలోని వివిధ విభాగాల్లో పని చేసింది. అయితే రాజకీయంగా కక్ష సాధింపులో భాగంగానే జయలక్ష్మీని వేధిస్తున్నారని స్థానిక టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నిద్రమాత్రలు మింగిన జయలక్ష్మీని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories