పోలవరంపై జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం

పోలవరంపై జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం
x
Highlights

పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం రైట్ అండ్ లెఫ్ట్ మెయిన్‌ కెనాల్స్ బాధ్యతల నుంచి రాష్ట్ర నీటి పారుదల...

పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం రైట్ అండ్ లెఫ్ట్ మెయిన్‌ కెనాల్స్ బాధ్యతల నుంచి రాష్ట్ర నీటి పారుదల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వర్రావును ప్రభుత్వం తప్పించింది. రాష్ట్ర నీటి పారుదల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా ఉన్న ఆయన.. పోలవరం చీఫ్‌ ఇంజినీర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా వెంకటేశ్వరరావును పోలవరం ప్రాజెక్టు బాధ్యతల నుంచి తప్పించి రాష్ట్ర నీటి పారుదల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంకటేశ్వర రావు స్థానంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యుడిగా సీఈ సుధాకర్‌బాబును ప్రభుత్వం నియమించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories