విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
x
Highlights

విద్యార్థులకు తీపీ కబురు చెప్పింది ఏపీ సర్కార్. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల రాయితీ బస్ పాస్ పరిధి పెంచుతున్నట్టు ఏపీ సర్కార్ ప్రకటించింది.

విద్యార్థులకు తీపీ కబురు చెప్పింది ఏపీ సర్కార్. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల రాయితీ బస్ పాస్ పరిధి పెంచుతున్నట్టు ఏపీ సర్కార్ ప్రకటించింది. బస్ పాస్ పరిధిని 35 కిలో మీటర్ల నుంచి 50 కిలో మీటర్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తాజా నిర్ణయం పాఠశాల మరియు కళాశాల విద్యార్థులందరికీ వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది.రాష్ట్రంలో 660 విద్యాసంస్థలు 35 కిలోమీటర్ల కంటే అధిక దూరంలో ఉన్నట్లు ప్రభుత్వం నిర్ధారించింది. దీంతో రాయితీ బస్‌పాస్‌ల కిలోమీటర్ల పరిధి 35 నుంచి 50 కిలోమీటర్లకు పెంచింది. ఈ నిర్ణయంతో 15 వేల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories