టీడీపీ ప్రముఖ నేతలకు భద్రతను తొలగింపు..

టీడీపీ ప్రముఖ నేతలకు భద్రతను తొలగింపు..
x
టీడీపీ ప్రముఖ నేతలకు భద్రతను తొలగింపు..
Highlights

టీడీపీకి చెందిన ప్రముఖ నేతలకు ప్రభుత్వం భద్రతను తొలగించింది. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాధ్ రెడ్డి,...

టీడీపీకి చెందిన ప్రముఖ నేతలకు ప్రభుత్వం భద్రతను తొలగించింది. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాధ్ రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద బాబుకు భద్రతను తొలగించారు. స్టేట్ సెక్యురిటీ రివ్యూ కమిటీ ఆదేశాల మేరకు భద్రత తొలిగించామని పోలీసులు చెబుతున్నారు.

అయితే భద్రత తొలగింపుపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి ముందస్తు నోటీసులు సమాచారం ఇవ్వకుండా భద్రత తొలగించడం ఎంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తమకు భద్రత కొనసాగించారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలుత భద్రతను కుదించి ప్రస్తుతం పూర్తిగా తొలగించడంపై నేతలు మండిపడుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories