ఆ విషయంలో కేసీఆర్‌ను అభినందించాలే కానీ విమర్శించడం సరికాదు: సీఎం జగన్

ఆ విషయంలో కేసీఆర్‌ను అభినందించాలే కానీ విమర్శించడం సరికాదు: సీఎం జగన్
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో నీటి కేటాయింపులు, మళ్లింపులపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్‌పై వెళ్లడంపై టీడీపీ...

తెలుగు రాష్ట్రాల్లో నీటి కేటాయింపులు, మళ్లింపులపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్‌పై వెళ్లడంపై టీడీపీ కామెంట్స్‌‌పై వైసీపీ భగ్గుమన్నది. దీనిపై రెండు పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే కాళేశ్వరం నిర్మాణం చేపట్టారన్న సీఎం జగన్‌ మనకు నీళ్లు ఇచ్చేందుకు కేసీఆర్‌ ఔదార్యం చూపిస్తున్నారంటూ సభలో చెప్పారు.

తెలంగాణ నుంచి శ్రీశైలం,సాగర్‌కు నీళ్లిస్తుంటే కేసీఆర్‌ను అభినందించాలే కానీ విమర్శించడం సరికాదన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే ఆల్మట్టి ఎత్తు పెంచారన్న జగన్‌ పదేళ్లలో ఏపీకి కృష్ణా నీటి లభ్యత దారుణంగా పడిపోయిందన్నారు. ఆల్మట్టి 524 మీటర్లు పెంచినప్పుడు ఏం చేశారంటూ చంద్రబాబును ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య పరస్పర అవగాహన ఉండటంతో తప్పులేదన్నారు జగన్‌.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories